
ప్రజల రక్షణ, భద్రత, నేరాలు, నాటుసారా అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా గుర్ల పోలీసు స్టేషను పరిధిలోని దేవుని కనపాక గ్రామంలో జూన్ 8న, వేకువ జామున 5గంటలకు చీపురుపల్లి సిఐ శంకరరావు ఆధ్వర్యంలో
సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్” నిర్వహించి, ఇండ్లలోను, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – చీపురుపల్లి సర్కిల్, గుర్ల పోలీసు స్టేషను పరిధిలోగల దేవుని కనపాక గ్రామంలో నాటుసారా నియంత్రణకు ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించామన్నారు. గ్రామంలో నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు చీపురుపల్లి సిఐ శంకరరావు ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్ఐలు, 35 మంది పోలీసు సిబ్బందితో
బృందాలుగా ఏర్పడి గ్రామంలోను, గ్రామ శివార్లలోను సోదాలు నిర్వహించామన్నారు. గ్రామంలో అన్ని ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అవరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి.
పరికరాలతో తనిఖీలు చేసామన్నారు. అదే విధంగా వారి వద్ద లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని ఆరు ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీసు స్టేషనుకు తరలించామన్నారు.
అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసాయన్నారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించాలని, నాటుసారా తయారీని నియంత్రించాలనే లక్ష్యంతోనే “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో గ్రామం
లోని శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 400లీటర్ల బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేసామన్నారు.
రాబోయే రోజుల్లో ఇదే తరహాలో జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్టనున్నామన్నారు. ఈ అపరేషన్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై “కార్డన్ అండ్ సెర్చ్” ఉద్ధేశ్యాన్ని, ఆపరేషన్ లో అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను జిల్లా ఎస్పీ వివరించి, ప్రజలెవ్వరితో దురుసుగా వ్యవహరించ వద్దని దిశా నిర్దేశం చేసారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషనులో
ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, నాటుసారావంటివి లభ్యం కాలేదన్నారు. “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను తరువాత గ్రామస్ధులతో చీపురుపల్లి సిఐ శంకరరావు సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట
వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నాటుసారా తయారీకి, అక్రమ రవాణకు స్వస్తి పలకాలని, ఉపాధి
పొందేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామస్ధులకు చీపురుపల్లి సీఐ సూచించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్లో చీపురుపల్లి సీఐ శంకరరావు, గుర్ల ఎస్ఐ పి.నారాయణరావు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు, బుదరాయవలస ఎస్ఐ లోకేష్ మరియు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.